
మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఏకైక హీరోయిన్గా, “మెగా ప్రిన్సెస్”గా గుర్తింపు పొందిన నిహారిక కొణిదెల తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయం. యాంకర్గా తన ప్రయాణాన్ని మొదలుపెట్టి, ఆ తర్వాత నటిగా, నిర్మాతగా తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకుంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉండే నిహారిక, తన ఫోటోలు, వీడియోలతో అభిమానులను ఎప్పటికప్పుడు అలరిస్తుంది.
ఇటీవల ఆమె షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తెలుపు-ఎరుపు కాంబినేషన్లోని సంప్రదాయ చీరలో తెలుగు అమ్మాయిగా అద్భుతంగా మెరిసిపోయింది. జడలో మల్లెపూలు, చేతుల్లో గాజులు, మృదువైన చిరునవ్వుతో నిహారిక సంపూర్ణ సౌందర్యానికి ప్రతిరూపంగా కనిపిస్తోంది. ఆ ఫొటోలు చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
నిహారిక కెరీర్ ప్రయాణం చాలా వైవిధ్యంగా సాగింది. బుల్లితెరపై ‘ఢీ’ వంటి పాపులర్ షోల్లో యాంకర్గా తనదైన స్టైల్తో ఆకట్టుకుంది. ఆ తర్వాత ‘ముద్దపప్పు ఆవకాయ్’ వెబ్ సిరీస్తో నటిగా అడుగుపెట్టి యూత్లో మంచి ఫాలోయింగ్ సంపాదించింది. ‘ఒక మనసు’తో వెండితెరకు హీరోయిన్గా పరిచయమైన ఆమె, ‘హ్యాపీ వెడ్డింగ్’, ‘సూర్యకాంతం’ చిత్రాల్లో నటించినా, అవి పెద్దగా విజయం సాధించలేదు.
దాంతో నటనకు కొంత విరామం ఇచ్చి, నిర్మాతగా కొత్త దారిని ఎంచుకుంది. ‘పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్’ పేరుతో సొంత ప్రొడక్షన్ హౌస్ను స్థాపించి, కొత్త టాలెంట్ను ప్రోత్సహించే వెబ్ సిరీస్లను నిర్మిస్తోంది. ఇటీవల ఆమె నిర్మించిన కమిటీ కుర్రోళ్ళు సినిమాకు మంచి స్పందన వచ్చింది.
కొంతకాలం వ్యక్తిగత కారణాలతో కెరీర్కు విరామం ఇచ్చిన నిహారిక, ఇప్పుడు మళ్లీ పూర్తిగా యాక్టివ్గా మారింది. కొత్త ప్రాజెక్టులపై దృష్టి సారిస్తూ, నటిగా మళ్లీ సక్సెస్ఫుల్ కమ్బ్యాక్ కోసం సిద్ధమవుతోంది. నిర్మాతగా తన దారిని మరింత బలంగా నిర్మించుకుంటూ, మరోసారి తన ప్రతిభను నిరూపించుకునేందుకు రెడీ అవుతోంది.
Recent Random Post:















