షర్మిలతో సానియా మీర్జా సోదరి ఆనం మీర్జా దంపతుల భేటీ

తెలంగాణ వైయస్ షర్మిల రాజకీయ పార్టీ ఏర్పాటుకు ఓ పక్క ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆమె జిల్లాల్లోని వైఎస్ అభిమానులతో ఆత్మీయ సమ్మేళనం పేరుతో సమావేశం అవుతున్నారు. పలువురు నాయకులు కూడా ఆమెకు అండగా నిలుస్తున్నారు. ఈ క్రమంలో పార్టీ ఏర్పాటుకు ఆమె అడుగులు వేగంగా వేస్తున్నారు. ఏప్రిల్ 9న పార్టీ ప్రకటిస్తారని ప్రకటించారు కూడా. ఈ నేపథ్యంలో లోటస్ పాండ్ లో ఆమెను కలుస్తున్నవారిలో సెలబ్రిటీలు కూడా ఉన్నారు.

ఈక్రమంలో టెన్నీస్ సెలబ్రిటీ సానియా మీర్జా సోదరి అనం మిర్జా, ఆమె భర్త అసదుద్దీన్ ఈరోజు షర్మిల తో హైదరాబాద్ లో భేటీ అయ్యారు. ప్రస్తుతం ఈ వార్త తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర సంచలనం రేపుతోంది. మోటివేషనల్ స్పీకర్ షఫీతో కలిసి వారు షర్మిలతో భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. అయితే.. వీరి భేటీ మర్యాదపూర్వకంగా జరిగిందా.. పొలిటికల్ గా షర్మిలతో కలిసి నడిచేందుకు నిర్ణయం తీసుకున్నారా.. అనేది తేలాల్సి ఉంది.


Recent Random Post: