
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్లో వచ్చే అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీ SSMB 29 కోసం ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు భారీగా ఎదురు చూస్తున్నారు. ఆఫ్రికన్ అడవుల నేపథ్యంపై సాగే ఈ సాహస కథ, గ్లోబల్ ట్రోటర్ సినిమాగా రూపొందుతోంది అని టాక్.
ఇప్పటికే కెన్యా, నైరోబీ లో అత్యంత పెద్ద యాక్షన్ సీక్వెన్స్ షెడ్యూల్ను పూర్తిచేశారు. ఇప్పుడు కొత్త షెడ్యూల్ను హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రారంభించారని తెలుస్తోంది. రాజమౌళి సినిమాకు కాస్త డివోషనల్ టచ్ కూడా ఇచ్చుతున్నట్లు సమాచారం. ఫిల్మ్ సిటీలో కాశీ సెట్ను ఏర్పాటు చేసి, అక్టోబర్ 10 వరకు మహేష్ బాబుతో పాటు మెయిన్ క్యాస్టింగ్ పై కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. ఎలాంటి లీక్స్ రాకుండా జక్కన్న కట్టుదిట్టమైన ఏర్పాట్లు కొనసాగుతున్నాయి.
అదే సమయంలో, సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతోంది. రాజమౌళి హాలీవుడ్ స్టూడియోతో ప్రధాన ఒప్పందాన్ని ఖరారు చేసుకున్నారని ప్రచారం జరుగుతోంది. ప్రముఖ వార్నర్ బ్రదర్స్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా SSMB 29 సినిమాను డిస్ట్రిబ్యూట్ చేయనుందని, ముఖ్యంగా అమెరికా సహా అంతర్జాతీయ మార్కెట్లలో ప్రమోషన్ నిర్వహించనుందని టాక్.
ఈ ఒప్పందం నిజమైతే, రాజమౌళి సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ మెటీరియల్ను కొన్ని నెలల ముందుగానే హాలీవుడ్ స్టూడియోకు సమర్పించాల్సి ఉంటుంది. విడుదలకు కనీసం మూడు నెలల ముందు పూర్తి మూవీ ఫైల్ కూడా అందించాల్సి ఉంటుంది. హాలీవుడ్ స్టూడియోలు సాధారణంగా అన్ని ఫార్మాలిటీలను ఒక నెల ముందే పూర్తి చేసి, ఆ తరువాత ప్రెస్ షోలు, డిస్ట్రిబ్యూటర్ స్క్రీనింగ్లు, ఇతర ప్రమోషనల్ కార్యకలాపాలను ప్రణాళికతో నిర్వహిస్తాయి.
Recent Random Post:














