ప‌హ‌ల్గామ్ ఉగ్ర‌దాడిపై లావ‌ణ్య త్రిపాఠి స్పందన

Share


ప‌హ‌ల్గామ్ లో జ‌రిగిన ఉగ్ర‌దాడి మొత్తం దేశాన్ని తీవ్రంగా కలచివేసింది. ఈ అమాయకులైన టూరిస్టులు ఉగ్ర‌దాడిలో ప్రాణాలు కోల్పోవడం వల్ల దేశవ్యాప్తంగా ప్ర‌జ‌లు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఉగ్ర‌దాడికి నిర‌స‌న‌గా, దేశం మొత్తం నుండి ప్ర‌జ‌లు స్వ‌చ్ఛందంగా రోడ్ల‌పైకి వ‌చ్చి నిర‌స‌న‌లు చేప‌డుతున్నారు.

ఉగ్ర‌వాద శక్తులపై నినాదాలు చేస్తూ, త‌మ నిర‌స‌న‌ను ప‌ల‌కరించి “ఉగ్ర‌వాదం న‌శించాలి”, “భార‌త్‌మాతాకీ జై” అంటూ కొవ్వొత్తుల ర్యాలీలు నిర్వహించి, దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి శ్రద్ధాంజ‌లి ఘ‌టిస్తున్నారు. ఉగ్ర‌దాడికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్ర‌జ‌లు ప్రభుత్వానికి లేఖ‌లు కూడా రాస్తున్నారు.

సోష‌ల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున చ‌ర్చ జరుగుతోంది. #PahalgamAttack, #IndiaAgainstTerrorism లాంటి హ్యాష్ ట్యాగ్లతో నెటిజ‌న్లు తమ కోపాన్ని వ్యక్తం చేస్తున్నారు. దేశంలో ప్రతి ప్ర‌జ కూడా ఒకే తాటిపై నిల‌బ‌డి, ఈ ఉగ్ర‌దాడిని ఖండిస్తూ, పాకిస్తాన్ జాతీయ జెండాను రోడ్లపై అంటించి కాళ్లతో తొక్కుతూ నిర‌స‌న‌లు తెలుపుతున్నారు. అయితే, హిమాచల్ ప్ర‌దేశ్‌లో ఒక యువతి పాకిస్థాన్ జెండాను రోడ్డు మీద నుంచి తీసేసి, దాన్ని తొక్కకుండా అడ్డుకోవ‌డంతో స్థానికులు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ యువతితో గొడ‌వ ప‌డి పాక్ జెండాను తిరిగి రోడ్ల‌పై పెట్టమని కోరినా ఆమె నిరాక‌రించింది. ఈ సంఘటన‌కు సంబంధించిన వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

ఈ విష‌యంలో టాలీవుడ్ నటి, మెగా కోడ‌లు లావ‌ణ్య త్రిపాఠి స్పందిస్తూ, “మన సైనికులు తమ ప్రాణాలను అడ్డుగా వేసి దేశాన్ని కాపాడుతుంటే, కొంద‌రు దేశానికి హాని కలిగించే వారికి మ‌ద్ద‌తు ఇవ్వ‌డం ఎంతో బాధ‌క‌ర‌మైన విష‌యం. దేశం లోపలి నుంచే శుద్ధిని మొద‌లుపెట్టాలి” అని పోస్ట్ చేసింది. ఆమె పోస్ట్ ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ అవుతుంది.


Recent Random Post: